గురువారం నుండి వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. వసంత ఋతువులో రెండవ మాసం వైశాఖ మాసం. దీనికి వైదిక సాంప్రదాయంలో 'మాధవ' మాసం అంటారు. వైశాఖ మాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. వైశాఖంలో రకరకాల వ్రతాలు చెప్పారు. వైశాఖ మాసంలో సూర్యుడు మేష సంక్రమణంలో ఉండగా ప్రాత: స్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకు ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువు ను లక్ష్మీ దేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో ఏక భుక్తం, నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమంగా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు, తపస్సులకు పూజాదికాలకు, దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.
బియ్యం 50 గ్రాములు, నల్లని నువ్వులు 50 గ్రాములు, ఆవు నెయ్యి 10 గ్రాములు, ఆవు పేడ కొంచెం, ఆవు పంచితం కొంచెం, గంధం పొడి 10 గ్రాములు, దొప్పలు 5, మూడు ఆకుల అంట , (మోదుగ ఆకులు 3 ) ఆచమనం పాత్ర 1,రాగి చెంబు 1, దీపం 1, ఆగరబత్తి , కర్పూరం , పూలు , తులసి దళాలు, వక్కలు, తమలపాకులు 20. చిల్లర పైసలు 15, ధర్భ కట్ట,1 ఆళ్వార్ సంభావన, స్వాములకు సంభావన, పేరుమాళ్ళ తీర్థం, సీపా తీర్థ0 (సంప్రదాయం లో ఉంటే)