Skip to main content

Posts

Sri Sudharshana Perumal Thiru Nakshatram on 31-7-2025 Thursday

  Maha sudarsana homam for removal of all enemies & avoiding accidents, The desires of human beings are innumerable and they vary in nature. The yantra (a symbol embedded in metal) used in the Homa, will keep all negativity at a distance and bring in divine and auspicious energies. It is performed for For any auspicious beginning Removal of astrological flaws For victory, courage and prosperity.  To annihilate evil forces. Suffering caused by incurable diseases, sorcery or enemies are dispelled by Lord Sudharshana. Alleviates the suffering of the progeny belonging to later generations due to non- performance of the last rites of the previous generations.  Stops the danger or problems, which may possibly occur in future The power of the Homam Homam is a sacrament performed to a particular divine being by appeasing ´Agni´, the lord of fire. Sun in the Hindu worldview, is considered, as the main source of energy in the universe and fire is believed to be symbolic of the ...
Recent posts

గోదాదేవి తిరునక్షత్రం తేదీ 28-7-2025 సోమవారం

భగవంతునికి  భార్యగా మారిన పుణ్యవతి ఆండాళ్‌నే గోదాదేవి .  హరి సంకీర్తనం, శరణాగతీ, పుష్పమాల సమర్పణం అనే మూడు సేవల గురించి శ్రీమహావిష్ణువు స్వయంగా భూదేవితో చెప్పినట్లు ఆర్యోక్తి..ఈ రోజున ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై సేవ కాలం మరియు ఆశ్తోతరం, ఆండాళ్ సూక్తి చదువుదాం రండి. శ్రీ వైష్ణవ దేవాలయాలకు రండి. కలిసి పూజలు  చేద్దాం.  విశిష్టాద్వైత మత ప్రచారకులైన 12 మంది ఆళ్వార్లలో ఒకరైన ఆండాళ్‌ అమ్మవారి తిరునక్షత్రo . గోదా దేవి తిరునక్షత్రం ఈ రోజు .  ఆండాళ్ అసలు పేరు కోదై. ''కోదై'' అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.   అంటే ఆవిడ విష్ణు చిత్తుల వారికి ఈ రోజున తులసి వనంలో దొరికింది .  నిజానికి భూదేవి ఆండాళ్ గా జన్మించిందని చెబుతారు.  అందుకే ఈ రోజు అన్ని వైష్ణవాలయాలలో ఆండాళ్ తిరునక్షత్రం విశేషంగా జరుపుతారు . తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమా...

కామిక ఏకాదశి తేదీ 21-7-2025 సోమవారం

  ఏకాదశి హిందూ మత విశ్వాసాలలో చాలా ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు పూర్తిగా ఈ విశ్వాన్ని పోషించే విష్ణువుకు అంకితం చేయబడింది. శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. శ్రావణ మాసంలో శ్రీ హరి ఆరాధన అత్యంత ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం, పేదలు, నిరాశ్రయులు మరియు నిస్సహాయులకు దానం చేయడం ద్వారా మరియు ఈ రోజున నారాయణుడిని పూజించడం ద్వారా, భక్తుడు మోక్షాన్ని పొందుతాడు.   , ఉదయ తిథి ప్రకారం, కామిక ఏకాదశి జూలై 21న జరుపుకుంటారు.   కామిక ఏకాదశి యొక్క ప్రాముఖ్యత కామిక ఏకాదశి నాడు ఉపవాసం ఉండి పేదలకు, నిరాశ్రయులకు మరియు నిస్సహాయులకు దానం చేయడం ద్వారా, ఒక వ్యక్తి అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతాడని చెబుతారు. చాతుర్మాసంలో వచ్చే కామిక ఏకాదశికి దానికదే ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నమ్మకాల ప్రకారం, ఈ ఏకాదశి అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున విష్ణువుకు తులసి ఆకులు సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.   ఏకాదశి నాడు దానం యొక్క ప్రాముఖ్యత  ఆధ్యాత్మిక ఉద్ధరణకు ప్రధాన సాధనం కూడా. దానం అంటే ఒకరి సంపద, సమ...

గురు పౌర్ణమి తేదీ 10-7-2025 గురువారం

ఆషాఢ మాస శుక్ల పక్ష పౌర్ణమిని ‘గురుపౌర్ణమి‘ లేదా ‘వ్యాసపౌర్ణమి‘ అని అంటారు. వ్యాసభగవానుడిని మానవాళి మెుత్తానికి గురువుగా భావిస్తారు. ఎందుకంటే అతడు వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో సంకలనం చేశాడు. అందుకే అతనిడి వేదవ్యాసుడు అని కూడా అంటారు. అంతేకాకుండా ఇతిహాసంగా పిలువబడే మహాభారత రచన కూడా ఆయనే చేశాడు. అందుకే వ్యాసమహాముని పుట్టినరోజును గురు పౌర్ణమిగా లేదా వ్యాసపూర్ణిమగా జరుపుకుంటారు. అదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతంది. ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతమవుతుందని పెద్దలు  చెబుతున్నారు.

యోగిని ఏకాదశి తేదీ 21-6-2025 శనివారం

  జ్యేష్ఠ మాసంలో వచ్చే యోగిని ఏకాదశి. ఈ ఏకాదశి మోక్షాన్ని పొందడానికి, పాపాలను నాశనం చేయడానికి, జీవితంలో ఆనందం, శాంతిని పొందడానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ రోజున ఉపవాసం ఆచరించడం ద్వారా.. 88 వేల మంది బ్రాహ్మణులకు ఆహారం పెట్టినంత పుణ్యం లభిస్తుంది.  పసుపు రంగు దుస్తులు, పువ్వులు, గంధం, ధూపం, దీపాలు, నైవేద్యం (పండ్లు, స్వీట్లు) భగవంతుడికి సమర్పించండి. విష్ణు సహస్రనామం లేదా “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రాన్ని జపించండి. ఏకాదశి వ్రత కథ చదవండి లేదా వినండి. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండండి. సాధ్యం కాకపోతే పండ్లు తినవచ్చు. ఉప్పు అస్సలు తినకండి. సాయంత్రం విష్ణువుకు హారతి ఇచ్చి మీరు తెలిసి తెలియక చేసిన తప్పులకు క్షమాపణ కోరండి. ద్వాదశి (పరణం) రోజున సూర్యోదయం తర్వాత స్నానం చేయండి. బ్రాహ్మణుడికి లేదా పేదవాడికి ఆహారం పెట్టి శక్తి మేరకు దానధర్మాలు చేయండి. దీని తర్వాత ఉపవాసం విరమించండి. సాత్విక ఆహారం తినండి. యోగిని ఏకాదశి ఉపవాసం సకల పాపాలను నాశనం చేస్తుందని, మరణానంతరం మోక్షాన్ని అందిస్తుందని నమ్ముతారు. ఈ రోజున విష్ణువును నిర్మలమైన హృదయంతో పూజించడం ద్వారా, ఉపవాస న...

హోమం పూజ సామగ్రి

  హోమ సామగ్రి :  పిరమిడ్ రూపములొ ఉండే ఒక రాగి పాత్ర , ఆవు పిడకలు ,5, నవధాన్యాలు అన్నీ కలిపి 1/2 కిలో,  స్వచ్చమైన ఆవు నెయ్యి , కిలో ,  పాలిష్ చెయ్యని బియ్యము (దంపుడు బియ్యము), సూర్యోదయము , సూర్యాస్తమయము వచ్చునట్లు గా ఉన్న ప్రదేశము (చోటు), ఎండు మామిడి , రావి,జువ్వి, మర్రి చెట్టు కొమ్మ పుల్లలు , కర్పూరము ,1 ముద్ధ పాకెట్  పూజా సామగ్రి ,పూలు,పండ్లు,  పూర్ణాహుతి పాకెట్,  తాటాకుల విసనకర్ర , ఎర్రని  మట్టి పాత్రలు 2,  ఔషద మొక్కల సమిధలు  , గంధం చెక్కలు , సువాసం ద్రవ్యాలు కొన్ని , బ్రాహ్మణ దక్షిణ Rs .  హోమ శక్తి :  ఔషధ ఉపయోగాలు : దానివలన కలిగే ఆరోగ్య నియంత్రణ , కాలుష్య నివారణా ప్రయోజనాలు ఎన్నో నిక్షిప్తంచేసి ఉన్నాయి . హోమము లో ఉన్నది అగ్ని శక్తి . ఆరోగ్యము కోసం నీటిని మరిగించడానికి అగ్నిశక్తి ని వాడుతాము . హోమము చేయు చోటు లో వెలుతురుకి చుట్టు ప్రక్కలకు క్రిమికీటకాలు చేరవు . హోమాగ్నితో వచ్చే వేడికి హానికరమైన సూక్ష్మజీవులు మరణిస్తాయి . హోమాగ్ని వేదికి కొన్ని హానికర రసాయనాలు మంచి గా మారుతాయి , మనసులో గూడుకట్టుకొన్న ఒత్తిడులు తొలగిపోయి ప్రశాం...

నిర్జల ఏకాదశి తేదీ 6-6-2025 శుక్రవారం

   ఉపవాసం రోజంతా ఆహారం, నీరు తీసుకోకుండా పాటిస్తారు. ఉపవాసం పాటించే వ్యక్తి నియమాల ప్రకారం నీళ్లు కూడా తాగరు. కనుకనే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి మర్నాడు ఉపవాసం విరమించిన తర్వాతే ఆహారం లేదా నీరు తీసుకుంటారు.  24 ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని భీమ సేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసాన్ని మొదటిసారిగా మహాభారత కాలంలో పాండు కుమారుడు భీముడు పాటించాడని.. అందుకే దీనిని భీమసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు.  విశ్వాసం ప్రకారం ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని భక్తితో పూజించి, ఉపవాసం ఉండేవారికి విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.అంతేకాదు ఆ వ్యక్తి వంశస్తులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని.. పూర్వీకులు పాపాల నుంచి విముక్తిని కూడా పొందుతారని నమ్మకం. ఉపవాసం ఉండటానికి సుర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానం చేయండి. ఆ తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి, సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. తరువాత భక్తితో, శ్రీ విష్ణువుకు జలాభిషేకం గంగా జలంతో పాటు పంచామృతంతో చేయండి, ఆ తర్వాత భక్తితో విష్ణువును...

దశ పాపహర దశమి తేదీ 5-6-2025 గురువారం

  దశపాపహర   దశమి  రోజు గంగాస్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నింటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణం చెప్పింది. కాశీలో స్నానమాచరిస్తే లభించే ఫలితం అంతా ఇంతా కాదు. అంతా కాశీ వెళ్లలేరు కాబట్టి నది, బావి, చెరువు, సముద్రం ఎక్కడైనా కానీ భక్తి శ్రద్ధలతో స్నానమాచరించాలి. గంగాదేవి ఆరాధనకు ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహా భారతంలో గాంగేయుని (భీష్ముని) వృత్తాంతంలో వర్ణించారు. వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ గాథ.ఈ రోజున శ్రీ గంగాష్టకం, శ్రీ గంగ స్తవః, శ్రీ గంగా స్తోత్రం చదువుకుంటే మంచిది.  ఇంతటి మాహాత్మ్యం ఉన్న గంగామాతను ప్రస్తుతిస్తూ స్కాంద పురాణం   ‘‘జ్యేష్ఠమాసి సితే పక్షే దశమీ హస్త సంయుతా హరతే దశపాపాని తస్మార్దశ హరా స్మృతా!’’   అన్నది. లోకంలో మనుషులు తెలిసీ, తెలియక పాపాలను చేయడం సహజం  .  పది పాపాలూ..  ఏమిటంటే.? పది విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడ...

gruha pravesh pooja samagri

 పసుపు 200 గ్రాములు, turmeric powder కుంకుమ 100 గ్రాములు, kumkum శ్రీ గంధం 1 చిన్న డబ్బా, gandham  బియ్యం 4  కిలోలు,rice  ప్లాస్టిక్ కప్పులు 10, plastic cups తమల పాకులు, 100,betel leaves వక్కలు 45, betel nuts ఖర్జూరం పండ్లు 35, dates dry fruits బాదం పలుకులు 200 గ్రాములు,badaam nuts రాగి చెంబులు 2, copper kalash ఆచమన పాత్ర 1, glass,spoon,plate etc. కూచోవటానికి చాపలు,  mats  వి డి పూలు 1/2 kilo , పూల దండలు,  loose flowers, and garlands అయిదు రకముల పండ్లు  five verities of fruits including banana dozan ఆవు పాలు లీటరు, cow milk one litre ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు, curd  ఆవు నెయ్యి దీపాలకు, 200 గ్రాములు,  ghee for lamps etc. sugar 1/4 kilo మంచి తేనె సీసా 200 గ్రాములు,  honey  వత్తులు, , అగ్గిపెట్టె, wicks and match box దీపం చెమ్మెలు  2, మంగళ హారతి నెయ్యి దీపం కుందె లు 2 చిన్నవి standing lamps and small lamps for haarathi  మామిడి కొమ్మలు, mango leaves నవ ధాన్యాలు:-(నవ గ్రహ పూజ,వాస్తు పూజ )  nava dhaanya (nin...

శ్రీ వైష్ణవ దేవాలయ ప్రసాదా ల వివరాలు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో లడ్డూ అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది.  తిరుమల లడ్డూలను జీడిపప్పు, కిస్మిస్లు వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సింహాచలం అప్పన్న ఆలయంలో పులిహోర, దద్ధోజనం ప్రసాదంగా పెడతారు. అన్నవరంలో గోధుమ నూకతో తయారు చేసిన ప్రసాదం ఎంతో ఫేమస్.  శ్రీకాళహస్తిలో పరమానాన్ని ప్రసాదంగా అందిస్తారు. భద్రాద్రి శ్రీ సీతారామ స్వామి ఆలయంలో పులిహోర, దద్ధోజనం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. బియ్యం, బెల్లం, కొబ్బరి తో వండే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది.  పళని సుబ్రమణ్య స్వామి ఆలయంలో అమృతపాణి అరటి పండ్లు, ఖర్జూరం, బెల్లం, నెయ్యి, యాలుకలతో తయారుచేసిన పంచామృతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. తిరువనంతపురంలోని గురువాయూర్ లో పాల పాయసం తయారు చేస్తారు. . శ్రీ కృష్ణ  సన్నిధిలో కోవా ప్రసాదంగా ఇస్తారు.  త్రిసూర్ వడుక్కనాథన్ గుడిలోకి కొబ్బరి పూర్ణం చాలా ఫేమస్ గా చెబుతారు. పూరి జగన్నాథ్ ఆలయంలో కాజా ప్రసాదం చాలా విశేషమైనది. శ్రీవెంకటేశ్వరుడికి అమితమైన ప్రీతి. అయితే శ్రీవారికి నివేదించే నైవేద్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీవారికి నైవేద్యంగా చక్రపొంగలి, కదంబ...