// శ్రీ రామ // పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, బియ్యం 2 కిలోలు, ఆఖ0 డ దీపం 1, మట్టిది 2, తమల పాకులు 50, నల్లని పోక వాక్కలు 25, అరటి పండ్లు డజను, ఆవు పంచితం 50 ml , రాగి చెంబు కలశం , మామిడి కొమ్మ, 1, పూలు, పూల దండలు, దేవుని ఫోటో 1, నెయ్యి దీపాలు చిన్నవి 2, (మంగళ హారతి ) నీళ్ళు , చిల్లర పైసలు 11, అగ్గిపెట్టె, 1,కంకణ దారం , పాలు పొంగించటానికి ఇత్తడి కొత్త గిన్నె 1 ఆవు పాలు 1/2 లీటరు కర్పూరం, ఆగరబత్తి, పాకెట్, 1 అయ్యగారి దక్షిణ Rs.3,500/-
శివుడు రతీదేవి పతి అయిన మన్మథుడ్ని దహించిన సంఘటన ప్రసిద్ధమైనది. శివతపస్సును భగ్నం చేసినందుకు కాముడ్ని భస్మం చేసినది ఫాల్గుణ పౌర్ణమి రోజే. రతీదేవి ఆర్తనాదాల్ని విన్న సృష్టికర్త మన్మథుడు లేని విశ్వంలో తన సృష్టి సాగదని గ్రహించి సర్వేశ్వరుని ఆగ్రహం చల్లార్చి విషయమును విశద పరిచింది. ఈశ్వరుడు రతీదేవిని కరుణించి మన్మథుడు నిర్వికారుడై భార్యవైన నీకు మాత్రమే కనిపిస్తాడు. ఈ విశ్వసృష్టికి మూలమైన స్రీపురుషులలో ప్రేమానురాగాలను, అన్యోన్యరసాలను అందిస్తూ జీవన ప్రక్రియకు దోహదం చేస్తుంటాడు అని చెప్పి మన్మథుడ్ని సజీవుడిని గావిస్తాడు. మన్మథుడు పునర్జన్మ పొందిన రోజు కూడా ఫాల్గుణ పౌర్ణమినాడే హిరణ్యకశ్యపుని సోదరి హోలిక అగ్ని కూడా కాల్చలేని మహాశక్తిమంతురాలు. తన కుమారుడైన ప్రహ్లాదుడు హరినామస్మరణను మరువమన్నా మాట వినక పోవడంతో హిరణ్యకశిపుడు మండిపడతాడు. హోలికను తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోపెట్టుకుని అగ్నిప్రవేశం చేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుడు హరిభక్తమహిమ వలన బయటపడతాడు కాని, హోలిక శక్తి సన్నగిల్లి అగ్నికి ఆహుతైపోయింది. ఇలా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నప్పటికీ మనిషి అంతరంగంలో ఉండే తుచ్చమైన కోరికల్ని దహింపచేసు